politics తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వృద్ధాప్య పెన్షన్ పెంచనున్నట్లు తెలుస్తోంది..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇందులో ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మంత్రి వర్గం..
ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు జరుగనుంది. వచ్చేయాడాది కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుందని తెలిపారు.. అలాగే ఈ సమావేశంలో వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది. అలాగే ఈ సందర్భంగా భూముల రీసర్వే నిమిత్తం మున్సిపాలిటీ చట్ట సవరణ, బాపట్ల-పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినమైన డిసెంబర్ 21న 5 లక్షల ట్యాబ్ల పంపిణీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్ధులకు ఈ ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు కడప జిల్లాలో జిందాల్ స్టీల్ భాగస్వామిగా తలపెట్టనున్న స్టీల్ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం లభించింది. దీనికితోడు ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకు ఆమోదం లభించింది.