Politics మధ్యప్రదేశ్లోని ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు.. లవ్ జిహాద్ పేరుతో కొందరు ప్రేమోన్మదానికి పాల్పడుతున్నారని అన్నారు. రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పధనైన కత్తులు ఇంట్లోనే ఉంచుకోవడం మంచిదని అన్నారు.
భోపాల్ ఎంపీ ప్రగ్వాసింగ్ తాజాగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు హిందువులకు తమపై దాడి చేసే వారిపై స్పందించే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు ఈ విషయం వారి గౌరవానికి సంబంధించింది కాదా అంటూ మాట్లాడారు.. రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పధనైన కత్తులు ఇంట్లోనే ఉంచుకోవాలంటూ చెప్పకు వచ్చారు లవ్ జిహాద్ పేరుతో కొందరు ప్రేమోన్మదానికి పాల్పడుతున్నారని ఇందులో ప్రేమ మాత్రం లేదన్నారు..
అలాగే ఈ లోకంలో ఉన్న అణచివేత దారులను పాపాత్ములను దేవుడు కచ్చితంగా అంతం చేయాలని లేదంటే ఈ పాపాలకు అంతం ఉండదని అన్నారు… ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. అంతేకుండా బాలికలకు చిన్న వయసు నుండే సరైన విలువలు నేర్పాలంటూ శివమొగ్గకు చెందిన హర్ష సహా పలువురు హిందూ కార్యకర్తల హత్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అలాగే కచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటిలో పదునైన ఆయుధాలు ఉంచుకోవాలని వీరి అయితే వంట గదిలో ఉన్న ఆయుధాలునైనా తమ దగ్గర ఉంచుకోవడం మంచిదని అన్నారు..