Home / POLITICS / Politics : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..

Politics : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..

Politics ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్‌ హైకోర్టు.

ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో ఓ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ తోసి పుచ్చింది అలహాబాద్ హైకోర్టు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ ఓబీసీలకు రిజర్వేషన్‌ లేకుండానే అర్బణ్‌ లోకల్‌ బాడీ ఎన్నికలను నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ సౌరవ్‌ లావానియాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ విధంగా తీర్పు చెప్పింది..

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అర్బణ్‌ లోకల్‌ బాడీ ఎన్నికల్లో డిసెంబర్‌ 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది . అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని 200 మున్సిపల్‌ కౌన్సిల్‌లో 54 ఛైర్‌పర్సన్ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తూ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో 18 మహిలకు కేటాయించింది. అలాగే 545 నగర పంచాయతీల్లో 147 సీట్లు ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించింది. అందులో 49 మహిళలకు కేటాయించారు. ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం కాక తాజాగా దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది అయితే ఈ విషయంపై తాజాగా కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.. అలాగే ఇరువాదనలు వినే నేపథ్యంలో ఈ కేసును శనివారం కు వాయిదా వేసింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat