తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం అంతా కలిసి చైర్మన్ చాంబర్లో ఫొటో దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.