దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం. గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు ఎలాగుర్తుకు వస్తుందో పాలపిట్ట అలాగే గుర్తుకువస్తుంది.. పాలపిట్ట దర్శనంతోనే దసరా సంబురాలు పరిపూర్ణం అవుతాయి..ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు పాలపిట్టను చూడటానికిచిన్నా పెద్దా, పిల్లాజెల్లాతో సహా ఊరు ఊరంతా కదులుతుంది. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, దోషాలు తొలిగిపోయి, చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం.
ఇంతకు పాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి అంటారా..దాని వెనుక పెద్ద కథే ఉంది.పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనిపించిందంట..అప్పటినుంచి వారికి విజయాలు సిద్ధించాయని జనపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం మగవాళ్లు తప్సనిసరిగా అడవికి పోయి పాలపిట్టను చూసిగానిఇంటికి వచ్చేవారు కాదంట..ప్రజల మనసుల్లో ఈ పాలపిట్టకు సాంస్కృతికంగా , పురాణాలపరంగాఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్ల రాష్ట్ర పక్షిగా ఇది వెలిగిపోతుంది. ఇప్పుడు ఈ పక్షి జాడ అపురూపమైపోయింది. పల్లెల్లో ఇవి అప్పుడప్పుడు మెరుపు మెరిసినట్లుగా కనిపిస్తున్నా..సిటీల్లో మాత్రం కనిపించకుండాపోయాయి. అందుకే దసరా పండుగనాడు కొందరు ఈ పాలపిట్టలను పట్టుకుని పంజరంలో ఉంచి చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తుంటారు. మరి కొందరు దసరా నాడు పాలపిట్టలను కొని ఊరి చివర పొలాల మధ్య విడిచి పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కే పక్షిఈ పాలపిట్ట. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. మరి ఇంతటి ప్రాశస్త్యం కల పాలపిట్టలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిమీద ఉంది.. దసరా నాడు పాలపిట్టను చూడండి..సకల శుభాలు పొందండి.