జగన్ చెప్పింది చేస్తున్నారు… ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ముందుకు వెలుతున్నారు. ఏపీ ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నా… తను ఎన్నికల వేల ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ప్రజల్లోకి తీసుకెలుతున్నారు. ఇప్పటికే పలు పథకాలను రిలీజ్ చేసిన జగన్ మరికొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెలుతున్నారు.
రేపు అనంతపురం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న వైఎస్ఆర్ కంటికి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తరువాత1 అనంతపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే సభలో పాల్గొననున్నారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి.
6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.