కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కోరిన వరాలు తీరుస్తూ..భక్తుల పాలిట కొంగుబంగారంగా విలసిల్లుతున్నాడు. ఆ శ్రీనివాసుడిని నమ్ముకుంటే ఇంట్లోసిరిసంపదలకు లోటు ఉండదు. అయితే కొందరికి ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు..వారి ఇంట్లో దారిద్ర దేవత తాండవిస్తుంది. ఏలిన నాటి శని వారిని పట్టిపీడిస్తుంది. అయితే ఆ వేంకటేశ్వరుడిని 7 శనివారాలు ఈ విధంగా పూజిస్తే ఏలిన నాటి శని వదలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే..శనివారం తెల్లవారుజామునే లేచి తలస్సానం చేసి పూజగదిని శుభ్రం చేసుకుని, అలంకరించుకోవాలి. శ్రీ వేంకటేశ్వరస్వామి పూజ ప్రారంభించి ముందుగా సంకల్పం చెప్సుకోవాలి. ఇక దీపం వెలిగించడానికి ఇత్తడి, వెండి, కుందులకు బదులుగా బియ్యంపిండి, బెల్లం, అరటిపండు కలిపి ఓ ప్రమిద తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలో సరిగ్గా ఏడంటే ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తదనంతరం శక్తిమేర స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అలాగే ఇంట్లో తులసీ కోట ముందు ఆవునెయ్యితోకాని, నువ్వుల నెయ్యితోకాని, దీపం వెలిగిస్తే..ఆష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీ మహాలక్ష్మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. అలాగే శనివారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించిన వారికి బాధలు తొలిగిపోయి..సుఖసంతోషాలు కలుగుతాయి. ఇలా 7 వారాల పాటు శ్రీ వేంకటేశ్వరస్వామికి పూజ చేస్తే..ఏలిన నాటి శని పోయి..మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో కలకాలం విలసిల్లుతున్నారు.