ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్సీపీ తన మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ జమ్మూీకశ్మీర్పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమని, అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత బలోపేతం అవుతుందని, వివక్ష అంతమవుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 350 రద్దుకు వైసీపీతో పాటు సమాజ్వాదీ, బీఎస్పీ, బీజేడీ, ఆప్, అన్నాడీఎంకే పార్టీలు మద్దతుతెలిపాయి. అలాగే కేంద్ర తీర్మానాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఎండీఎంకే, డీఎంకే, పీడీపీ ఎన్సీపీలు వ్యతిరేకించాయి. అలాగే జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిహోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసారు. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసారు.
