Home / POLITICS / Ysr Congress Party : రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించిన వైకాపా..!

Ysr Congress Party : రీజనల్ కోఆర్డినేటర్లను ప్రకటించిన వైకాపా..!

Ysr Congress Party : క్షేత్ర స్థాయిలో వై‌ఎస్‌ఆర్‌సి‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలకు ఒకరు చొప్పున రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వంటి పలు నియామకాల ద్వారా పార్టీ ముఖ్య నాయకులను ఫీల్డ్ లో బిజీ గా ఉంచుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని తెలుస్తుంది.

ఈ నియామకాల ప్రకారం…

శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కోఆర్డినేటర్‌గా – బొత్స సత్యనారాయణ
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా – వైవీ సుబ్బారెడ్డి
కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా – పిల్లి సుభాష్, మిథున్ రెడ్డి
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా – మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కో ఆర్డినేటర్లుగా – బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి
నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా – బాలినేని శ్రీనివాస రెడ్డి
అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా – పెద్ది రామ చంద్రారెడ్డి
కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా – ఆకేపాటి అమర నాథ్ రెడ్డి

ఈ ప్రకారం నూతన రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat