Politics టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు అలాగే రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఎంపీ సీనియర్ నరసింహారావు ఇన్నాళ్లుగా ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పమన్నారు.. ఎంపీ జీవీఎల్ శనివారం మీడియాతో మాట్లాడారు.. గత టీడీపీ హయంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పూర్తవకుండా ఉండిపోయిన పోలవరం నిర్మాణంలో గత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఎన్నోసార్లు చంద్రబాబుపై విరుచుకుపడిన జీవీఎల్ నరసింహరావు అతని తీవ్ర స్థాయిలో విమర్శించారు.. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామనీ చెప్పుకొచ్చే చంద్రబాబునాయుడు.. అసలు అభివృద్ధి అంటే ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.. ఆంధ్రకు చేసిన మేలేంటో వివరించాలని అన్నారు.. ఇంత చేసి తిరిగి ఇప్పుడు రాష్ట్రాన్ని, అధికార ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారని అన్నారు..