politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు ఎప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తున్న జగన్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు వైయస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా మంత్రి కొట్టు సత్యనారాయణ స్వయంగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు.. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ.. సుబ్బారావు మృతిచెందారు. ఆయన మృతిపట్ల జగన్ సంతాపం వ్యక్తం చేశారు.. అలాగే ఆయన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన ఎడవల్లి సుబ్బారావు (62) ఏడో తారీఖున విజయవాడలో జరిగిన జయహో బీసీ సభకు హాజరయ్యి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆయనను దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందించారు అయినప్పటికీ ఆయన మంగళవారం మృతి చెందారు..దీంతో వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తెలియజేయగా ఆయన వారి కుటుంబానికి తగిన సాయం చేయాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో వెంటనే మంత్రి కొట్టి సత్యనారాయణ వెళ్లి వారికి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు..