Home / POLITICS / Politics : ప్రధానితో జగన్ భేటీ పూర్తి..

Politics : ప్రధానితో జగన్ భేటీ పూర్తి..

Politics ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై జగన్ మోడీతో సంభాషించినట్టు సమాచారం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చ జరిపినట్టు తెలుస్తోంది అలాగే కోవిడ్ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగన్ మోడీకి తెలిపినట్టు సమాచారం.

అలాగే రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ ఆనాటి విభజన చట్టంలో పేర్కొన్న చాలా విషయాలను ఇప్పటివరకు పూర్తి చేయలేదని తెలిపినట్టు సమాచారం అలాగే మీరు తెలుగు రాష్ట్రాలు మధ్య ఇంకా చాలా అంశాలు విషయంలో విభేదాలు తలెత్తుతున్నట్టు మోడీకి వివరించినట్టు తెలుస్తోంది.. అలాగే విభజన చట్టంలో ఉన్న విషయాలను త్వరలోనే పరిష్కరించాలని మోడీని కోరినట్టు సమాచారం అంతేకాకుండా పార్లమెంటు వేదికగా ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ అన్నారని.. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు హామీలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని ఏర్పాటైన కమిటీల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఈ అన్ని విషయాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని మోదీని కోరినట్టు తెలుస్తోంది అలాగే ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్పల కీలక విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat