Politics వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకున్నారు ఈరోజు తిరుమలకు ఎందరో భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖుల సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.. అలాగే లగడపాటి ఈరోజు శ్రీవారిని దర్శించుకుని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు… స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు..
ప్రసిద్ది పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటోన్నారు. దీంతో తిరుమల కొండపైన భక్తుల హడావిడి నెలకొంది స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పట్టగా క్యూలైన్ లని భక్తులతో కిటకిటలాడాయి.. ఈ ఒక్క రోజే స్వామివారికి 31 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నట్టు సమాచారం అలాగే ఈ రోజు హుండీ ఆదాయం కూడా ఐదు కోట్లకు దాటింది ఇంతటి విశిష్ట రోజును ఆంధ్రకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నారు…
అలాగే శ్రీవారిని దర్శించుకున్న వారిలో తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, శాసన సభ్యుడు జ్యోతుల చంటిబాబు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదు.. విజయవాడ నుంచి తన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు.