పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం 2020-21ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేశారు. రూ.5లక్షల వరకు ఆదాయపు పన్నును మినహయిస్తున్నాము అని ఆమె స్పష్టం చేశారు. అయితే రూ.5లక్షల నుండి 7.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 10శాతమే పన్ను విధించనున్నట్లు నిర్మలా తెలిపారు.
*రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం
* రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం
* రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం
* రూ.15లక్షల వరకు ఆదాయ ఉంటే వారికి రూ.78వేలు ప్రయోజనం చేకూరనున్నట్లు నిర్మలా తెలిపారు.
