ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిపాజిట్ల దారులకు తీపికబురు అందించింది.2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా బ్యాంకు వినియోగదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలియజేస్తూ” బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం రూ.1 లక్ష వరకు ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రతిపాదించారు. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే.. సదరు
బ్యాంకు కస్టమర్లకు అసలు మొత్తం, వడ్డీలపై రూ.1 లక్ష వరకు ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు సేవింగ్స్, ఫిక్సిడ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో సంబంధం లేకుండా రూ.1 లక్ష వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం రూ.5 లక్షల వరకు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది.
