ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా పరంగా చూసుకుంటే ఈ సంఖ్య 125కు చేరుకోగా ఇద్దరు మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, మాల్స్, పార్కులు అన్ని ముసేయాలని ఆర్డర్ పాస్ చేసింది.
