Politics జెడి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి తన మద్దతు ఇస్తారా అనే విషయంపై తాజాగా కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది అయితే తాజాగా జాతీయస్థాయిలో ఏర్పాటు అయినా బీఆర్ఎస్ పార్టీలో జేడీ చేరుతారు అంటూ వార్తలు వినిపిస్తూనే పద్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అలాగే కొన్ని రోజులు ఆప్ పార్టీకి ఆయన మద్దతు ఉంటుందని మరికొన్ని రోజులు జనసేన పార్టీలో చేరుతారు అంటూ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి.. అయితే ఈ నేపథ్యంలో స్పందించిన జెడి తను ఏ పార్టీలో చేరుతాను అనే విషయం పెద్ద నియోజకవర్గం క్రియేట్ చేయాలని అందరూ చూస్తున్నారని కొందరు యూట్యూబ్ ఛానల్స్ తమ రేటింగ్ కోసం ఇలాంటి వార్తలు రాస్తున్నాయని అన్నారు అంటే ఎవరు చూస్తారు అలాగే ఆయన ఆ పార్టీలో చేరుతారు అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది అలాగే జనసేనకు మద్దతుగా నిలబడతారు అంటే మరింత ఆసక్తిగా ఉంటుంది ఇలాంటి రేటింగ్ కోసం వాడేసుకుంటున్నారు అంటూ చమత్కరించారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో తను కచ్చితంగా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు అలాగే తన ఆలోచనలతో ఎవరైతే ఏకీభవిస్తారో ఆ పార్టీతో ఉంటానని అలాగా తనకి ఎవరూ కనిపించకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని తెలిపారు.. అలాగే విశాఖ ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆదరించారని అందుకే మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని అలాగే ఈ విషయంపై తనకు కొన్ని అభిప్రాయాలు కచ్చితంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు అలా అభిప్రాయాలతో ఏకీభవించే వారి కోసం ఎదురు చూస్తున్నా అంటూ తెలిపారు..