Home / POLITICS / Politics : భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన వైనం..

Politics : భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన వైనం..

Politics కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత జూడయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది..

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జొడో యాత్ర ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే.. ఈ యాత్రలో చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాల్గొంటూనే ఉన్నారు..అయితే పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది..

మధ్యప్రదేశ్‌ బార్వానీ జిల్లాలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్రకు హాజరైనందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజేష్‌ కన్నోజే సస్పన్షన్‌కి గురయ్యాడు. ఆయన కనాస్యలోని రాష్ట్ర గిరిజన వ్యవహార విభాగంలో ఒక ప్రాథమిక పాఠశాల్లోని ఉపాధ్యాయుడు. అతను యాత్రలో పాల్గొన్న ఒకరోజు తర్వాత ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారంటూ అధికారులు సస్పెండ్‌ చేశారు. కాగా అతని సస్పెన్షన్‌ ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ విషయంపై మధ్యప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ కెకె మిశ్రా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు..శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ప్రభుత్వం ఉద్యోగులను రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘం శాఖలలో మాత్రమే పాల్గొనడానికి అనుమతించిందని ఎద్దేవా చేశారు. రాజేష్‌ కన్నోజ్‌ అనే గిరిజనుడు ఆ యాత్రలో పాల్గొని రాహుల్‌కి విల్లు, బాణం బహుమతిగా ఇచ్చినందుకే ఆయనపై వేటు వేశారని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat