తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరు ఎలక్షన్లో గెలిచిన 90 రోజుల్లో ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సమర్పించకపోవడంతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుంటే.. తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని ఈసీ హెచ్చరించింది. అఫిడవిట్ దాఖలు చేయని ఎంపీల ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అధిక ఖర్చుల విషయం బయటపడుతుందనే భయం ఎంపిల్లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు 45 రోజుల్లో అఫిడివిట్ ఇవ్వాలని…. ఎలక్షన్ వాచ్ కన్వీనర్ వివి రావు తెలిపారు.
