యావత్ భారతీయుల ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ – 2 విఫలం అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా చంద్రుడిపై 2.1 కి.మీ. ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రం ల్యాండర్నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో ఇస్రో ఛైర్మన్ శివన్ ఈ ప్రయోగం విఫలం అయినట్లు ప్రకటించారు. విక్రం ల్యాండర్ ఆచూకీ కనపడకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు..ఛైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో స్వయంగా మోదీ ఆయన్ని ఓదార్చారు. అయితే యావత్ దేశాన్ని ద్రిగ్భాంతికి గురి చేసిన చంద్రయాన్ – 2 విక్రమ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఇవాళ ఇస్రో ఛైర్మన్ డా.కె శివన్ కీలక ప్రకటన చేశారు.చంద్రయాన్ – 2 లో భాగంగా చంద్రుడిపై ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ ఎక్కడ ఉందో కనుక్కున్నామని శివన్ తెలిపారు. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అయితే విక్రమ్ ల్యాండర్తో తెగిన సంకేతాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లు శివన్ తెలిపారు. కాగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీని చంద్రయాన్ – 2 ఆర్బిటర్ గుర్తించిందని, అదే ఆర్బిటర్ ద్వారా విక్రమ్ ల్యాండర్తో సంకేతాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను తీసిందని ఆయన తెలిపారు. దీంతో విక్రం ల్యాండర్ మళ్లీ చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.