జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.నిషేధిత సిపిఐ (మావోయిస్టు) గ్రూపు సభ్యులు బుండు, నామ్కుమ్ మధ్య దస్సాం జలపాతం సమీపంలో గుమిగూడారనే సమాచారం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అదనపు పోలీసు జనరల్ మురారీ లాల్ మీనా పిటిఐకి తెలిపారు.”మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు, మా జిల్లా జవాన్లలో ఇద్దరు బుల్లెట్ గాయాలకు గురయ్యారు. ఒక జవాన్ ఆసుపత్రిలో చనిపోయినట్లు ప్రకటించగా, మరొకరు చికిత్స సమయంలో మరణించారు” అని ఏడీజీపీ చెప్పారు.