Home / Uncategorized /  వైఎస్ జగన్ గురించి నటుడు పృథ్వీ సంచలన వాఖ్యలు..సోషల్ మీడియా షేక్

 వైఎస్ జగన్ గురించి నటుడు పృథ్వీ సంచలన వాఖ్యలు..సోషల్ మీడియా షేక్

ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఏంపీలు, కార్యకర్తలు వైపీలో చేరుతున్నారు. ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్‌ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్‌ మంగళవారం జననేతను కలిశారు. వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

అనంతరం పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. మండుటెండలను లెక్కచేయకుండా.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. వైఎస్‌ జగన్‌ జననేత. మాట తిప్పని, మడమ తిప్పని మహాయోధులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ మాత్రమే. నేను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరే. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగి పోయిందంటే జగన్‌కు ఏ స్థాయిలో జనాధరణ ఉందో అర్ధమవుతోంది’అని తెలిపారు. ప్రస్తుతం ఆ వాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat