తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులును పెడుతున్న ప్రతిపక్ష పార్టీకు చెందిన ఓ వీరాభిమాని “ఛలో ఢిల్లీ” అనే ఫేక్ ఐడీతో రెచ్చిపోతున్న ఓ నెటిజన్ పై సీసీఎస్ లో పిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి.
ఈ సందర్భంగా దినేష్ చౌదరి మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరవై ఏండ్ల కలను సాకారం చేసి గత ఎనిమిదేళ్లుగా అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ యావత్ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా పాలిస్తున్న దేశ్ కా నేత సీఎం కేసీఆర్ గురించి ఎవరైన అసభ్యకరమైన పోస్టులు పెడితే ఊరుకోము అని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను,కేసీఆర్ పాలనపై సబ్జెక్టు ఫరంగా వాదించాలని కానీ మనోభావాలను గౌరవించకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా పోస్టులు పెడితే చట్టఫరంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో పిర్యాదు అందుకున్న సీసీఎస్ అధికారులు త్వరలోనే ఆ నెటిజన్ వివరాలను సేకరించి చట్టఫర చర్యలు తీసుకుంటామని చెప్పారని దినేష్ చౌదరి వివరించారు.