ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ టూర్లపై టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అదిరిపోయే సెటైర్ వేశారు. తాను ఓ కొత్త కూటమి ఏర్పాటు చేశానని ప్రకటించుకున్న చంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తానే కొత్తగా కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చంద్రబాబే వచ్చి చేరారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో వివిధ వర్గాల జనాభా శాతాల్లో మార్పు ఉన్నందున దానికి అనుగుణంగా ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. బీబీ పాటిల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత గిరిజనుల జనాభా ఆరు శాతం నుంచి 10 శాతానికి పెరిగిందని, బీసీ-ఈ సామాజిక వర్గాల జనాభా 37 శాతానికి పెరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఆపారని అన్నారు. సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు చట్టంతో సమానం కాబట్టి దాన్ని కూడా సవరించాలని కోరుతున్నామని వినోద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.