శత్రుదేశం పాకిస్తాన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియో కూడా విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత పైలట్ ఒకరు పాకిస్తాన్ సైన్యానికి చిక్కారని భారత్ కూడా దృవీకరించింది. అయితు అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.
