ఒకపక్క వ్యర్ధ పదార్ధాలు, మరోపక్క బాణాసంచా…వీటికి తోడు వాహనాల నుండే వచ్చే పొగ. మొత్తం అన్ని దేశ రాజధానిని కాలుష్య ప్రాంతం మార్చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీపావళి తరువాత మరింత పెరిగిపోయింది. ఇప్పుడు రోజురోజుకి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. దాంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉందనే చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ పిల్లల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు.
