ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్జంగ్ నుండి వైద్యులు ఎప్పటికప్పుడు చెకప్ చేస్తున్నారు. ఇక మొత్తంలో 302మంది మగవాళ్ళు, ముగ్గురు పిల్లలు, 100మంది ఆడవాళ్ళు మరియు ఒక బేబీ ఉన్నారు.