ప్రపంచవ్యాప్తంగా రోజురోజకి కరోనా మహమ్మారి దూసుకుపోతుంది. ఈ మేరకు అన్ని దేశాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్రాల్లో అయితే ప్రజల శ్రేయస్సు కొరకు తమ పదవులు సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి వారికి తోచిన సాయం చేస్తున్నారు నాయకులు.తాజాగా ఇదే బాటలో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా వెళ్లారు. కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని, అవసరమైతే అందుకు ఎంపీ నిధుల నుంచి ఖర్చు చేయవచ్చని కేంద్రం తాజాగా వెసులుబాటు కల్పించింది. దీని ఆసరాగా విశాఖ జిల్లాలో వైద్య పరికరాల కొనుగోలు కోసం నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్కి సిఫార్సు చేయడం జరిగింది అని ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
