Home / NATIONAL / ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!

ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!

కొన్నేళ్లుగా నలుగుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీకి దురుదెబ్బ తగిలింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్‌ కోరుతూ ఆదాయంపన్నుశాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్‌ డిపార్ట్ మెంట్‌కు ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి, 2011-12 ఆర్థిక సంవత్సరపు పన్ను రీ-అసెస్‌మెంట్‌ను ఆదాయపు పన్ను శాఖ తిరిగి తెరవడంపై రాహుల్‌ గాంధీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రీ-ఎసెస్‌మెంట్ నోటీసులు పంపడంలో ఆదాయం పన్ను శాఖకు ‘దురుద్దేశాలు’ ఉన్నాయని సోనియాగాంధీ గత నెలలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్నారు. కానీ రాహుల్‌ గాంధీ ఎటువంటి ఆదాయాన్ని ఆర్జించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడి న్యాయవాది తెలిపారు. రాహుల్‌ గాంధీ యంగ్‌ ఇండియాకు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించగా ఈకేసులో ఇది ప్రధాన కంపెనీ. ఆదాయపు పన్ను శాఖ దగ్గర రాహుల్‌ గాంధీ నిజాలు దాయడంతో, రూ.154.97 కోట్ల విలువైన మొత్తాన్ని ఆర్జించినట్టు ఆదాయపు పన్నుశాఖ పేర్కొంది. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈ కేసు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat