ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే మొబైల్ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్లో 33.13 కోట్ల మొబైల్ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా కొన్ని షరతులతో కూడిన కండిషన్ లు పెట్టడం జరిగింది. ప్రతీ నెల కనీస రీఛార్జి లేకుంటే ఇన్ కమింగ్ కాల్స్ నిలిపివేస్తం అనడంతో నిరాశకు గురైన యుజర్స్ తగ్గుమొకం పట్టారు. ఒక్కప్పుడు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కలిసి ఉండడంతో దేశంలో టాప్ లో ఉండేది. ప్రస్తుతం అది కాస్త మూసుకునే వరకు వచ్చింది. రిలయన్స్ జియో గత మే నెలలోనే భారతీ ఎయిర్టెల్ను నెట్టేసి రెండో స్థానానికి రాగా ఇప్పుడు టాప్ కు వచ్చేసింది. మొత్తం మీద ఈ ఏడాది సుమారు రూ.4,874 కోట్లు వొడాఫోన్ ఐడియా నష్టం వాటిల్లింది.