Home / NATIONAL / మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!

మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!

యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్‌ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ను గురువారం నాటికి చంద్రుడికి 35 కిలోమీటర్లు దగ్గరగా.. 101 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్బిటర్‌ చంద్రుడికి 96 కిలో మీటర్లు దగ్గరగా..125 కిలోమీటర్లు దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక మిగిలింది ల్యాండర్‌ విక్రమ్‌ను చంద్రుడిపై దించడమే. ఈ తుది ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ను శనివారం తెల్లవారుజామున ఒంటి గంట 55 నిమిషాలకు చంద్రుడిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. అంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య అందులోంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్‌ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది. విక్రమ్‌ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు అందుతుంది. కాగా విక్రమ్‌ ల్యాండింగ్‌ను స్వయంగా ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్‌ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి తిలకించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat