రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగనుందన్న వార్తల సమయంలో సోనియా గాంధీ యూపీఏ మిత్ర పక్షాలతో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం అన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్లాలని యూపీఏ మిత్ర పక్షాలు నిర్ణయించాయి. పోరాట కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాడైంది. డీ మానిటైజేషన్కు ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనకు యూపీఏ మిత్ర పక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.అయితే కొంత కాలంగా ఇంటికే పరిమితమైన సోనియా గాంధీ… 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాహుల్ దూకుడుకు సోనియా మంత్రాంగం జతకలిస్తే తమకు తిరుగుండదని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. అటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోనే బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కోగలమని అభిప్రాయపడుతున్నాయి.
