పాటీదార్ నేతలు బీజేపిలోకి చేర్చుకునేందుకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత గొంతు నొక్కలేరని. డబ్బులిచ్చి కొనలేరంటూ బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న అహ్మదాబాద్లో నిర్వహించిన నవ సర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని, గత 22 ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయకపోవడం , కేవలం 5 నుంచి 10 మంది పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తుండటం ఈ ప్రజా ఉద్యమానికి కారణమని రాహుల్ అన్నారు.
