సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్ లో ఆరుగురు ఏర్పాటువాద నేతలకు కల్పిస్తున్న సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు.ఏర్పాటువాదల ఉపసంహరణ మంచి నిర్ణయమని మాజీ సైనికులు అంటున్నారు.ఈ నిర్ణయాని ముందుగా తీసుకుంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్నాయి.జమ్మూకాశ్మీర్ ఆందోళనతో రగిలిపోతుంది.దొంగ దాడితో జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు వారికి సహకరించిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని అక్కడ యువత నిలదీస్తుంది.