Home / CRIME / వ్యభిచారం నడిపేవారికి అప్పులు ఇచ్చి.. అమ్మాయితో గడిపి

వ్యభిచారం నడిపేవారికి అప్పులు ఇచ్చి.. అమ్మాయితో గడిపి

ఏపీలో వ్యభిచారం జోరుగా సాగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్ల్ లో సెక్స్ రాకెట్ పడుపుతున్నారు.తాజాగా కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్‌ కాలనీలో వ్యభిచార నిర్వాహకురాలు పూల లక్ష్మి షీటీమ్స్‌ మరోసారి పట్టుబడింది. ఇంతకముందే నగరంలోనే రామచంద్ర నగర్‌లో పూలలక్ష్మి నివాసం ఉంటూ ఆసుపత్రి ఎదుట లాడ్జీలకు అమ్మాయిలను పంపుతుండగా షీటీమ్స్‌ పట్టుకున్న సంగతి విదితమే. జైలుకు వెళ్లిన ఆమె బెయిలుపై బయటకు వచ్చి వీకర్‌సెక్షన్‌ కాలనీలో వెంకటలక్ష్మి అనే మరో మహిళతో కలిసి వ్యభిచారం పునఃప్రారంభించారు. నిఘా ఉంచిన షీటీమ్స్‌ ఎస్సై విజయలక్షి, పోలీసు సిబ్బంది ఆదివారం ఉదయం వారి ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు విటులు శివకుమార్‌ (బేతంచర్ల), తెలుగు మధుసూదన్‌ (మహబూబ్‌ నగర్‌), మహ్మద్‌ బాషా (కర్నూలు), చలంగారి కృష్ణ (కర్నూలు)ను అరెస్టు చేశారు. వీరిలో మహ్మద్‌ బాషా వడ్డీ వ్యాపారం చేస్తుంటారని, వ్యభిచార నిర్వాహకులకు అప్పులు ఇచ్చి అమ్మాయితో గడిపి వెళ్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులను నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో అప్పగించి సీఐ నాగరాజరావుకు వివరించారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat