రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నెమలిపేటలో దారుణం జరిగింది. వివరాల్లోకెళితే.. స్థానిక పాఠశాలలో విద్యావాలంటీర్గా పని చేస్తున్న ప్రవళిక అనే యువతిని.. ఆమె మేనబావ శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే అతనికి ఉద్యోగం లేని కారణంగా తనతో పెళ్లికి ప్రవళిక నిరాకరించింది. కొద్దిరోజుల క్రితం ప్రవళ్లికకి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.దీన్ని తట్టుకోలేకపోయిన శ్రీనివాస్ శనివారం ప్రవళిక పని చేస్తున్న పాఠశాల వద్ద ఆమెపై దాడికి దిగాడు. కత్తితో ఆమెను దారుణంగా గొంతుకోసి చంపేశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ టీచర్ హత్యకు గురవడాన్ని చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.