యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది దీనిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పారాసిట్మల్ సీఎం అని, బ్లీచింగ్ సీఎం అంటూ ఎగతాళి చేసారు. ఈ క్రమంలో అసలు కరోనా ట్రీట్మెంట్ చేసిన వైద్యులంతా పారాసిట్మల్ నే వాడుతున్నామని, బ్లీచింగ్ చల్లిస్తున్నామంటూ వివరణ ఇచ్చారు. దాంతో జగన్ ని ట్రోల్ చేసినవారంతా కిమ్మనడం లేదు. వాస్తవానికి సీఎం జగన్ వ్యాఖ్యలు మాత్రం వీరు ఆపాదించిన విధంగా లేవు. కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలని, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారని, ఇదొక భయానక పరిస్థితిలొ అని ‘పానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలని సూచించారు. ఏపీలో ఇప్పటివరకూ 70మంది నమూనాలు పరిశీలిస్తే అందులో ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్గా వచ్చిందని, ఈ కరోనా కేసుల్లో 13.8 శాతం మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయని, 85 శాతం కేసులకు ఇంటి దగ్గరే చికిత్స జరుగుతోందన్నారు. ఇది రెండు, మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు యేడాదిపాటు కొనసాగుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Home / ENVINORNMENT / పారాసిట్మల్, బ్లీచింగ్ అంటూ ట్రోల్ చేసిన ఇల్లిటిరేట్స్ తెలుసుకోవాల్సిన విషయం !
Tags bleeching Corona Virus paracetmol treatment