Home / CRIME / వంతెన మీద నుంచి పడిన బస్సు.. 14 మంది మృతి

వంతెన మీద నుంచి పడిన బస్సు.. 14 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ వంతెన మీద నుంచి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం బిహార్‌లో జరిగింది. సీతారామర్హి జిల్లా భానస్పట్టి గ్రామ శివారులోని రున్ని సైద్‌పూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌-77 హైవేపై ముజఫర్పూర్ నగరం వైవు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చాలా ఎత్తు నుంచి బస్సు కింద పడటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat