మాకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించింది ఒక దళిత ప్రేమజంట. అమ్మాయి తండ్రి అయిన బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తమను విడగొట్టాలని చూస్తున్నాడని ఫిర్యాదులోతెలిపారు . తన తండ్రి తమలాంటి ఎన్నో ప్రేమజంటలను విడగొట్టాడని స్నేహ తెలిపింది. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరం ఒకే కులానికి చెందినవాళ్లం కావడంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ప్రయత్నించినా తన తండ్రి ఒప్పుకోలేదని తెలిపింది. అందుకే ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నామని స్నేహ వివరించింది.
