వరుసగా మూడో రోజు బంగారం ధర పడిపోయింది. సోమవారం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,450కి చేరింది. పండుగ సీజన్ ముగియడం, అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ మందగిండంతో పసిడి ధర పడిపోయినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. రూ.50 పెరిగి కిలో వెండి ధర రూ.40,900గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ వూపందుకోవడంతో వెండి ధర స్వల్పంగా పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.41శాతం తగ్గడంతో ఔన్సు 1,274.80డాలర్లు పలికింది.
