దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెండైన పోలీసు అధికారి జైలులో ఉండగా…ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై కుటుంబ స్నేహితుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని కల్యాణ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబయి నగరానికి చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టరు కేసులో చిక్కి సస్పెండ్ అవ్వడంతోపాటు జైలుకు వెళ్లాడు. భర్త ఏడాదిపాటు జైలులో ఉండగా అతని భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతని కుటుంబ స్నేహితుడైన అంబర్ నాథ్ ప్రైవేటు పాఠశాల ట్రస్టీ షిండే భర్తకు బెయిలు ఇప్పిస్తామని చెప్పి ఇన్స్పెక్టరు భార్య వద్ద నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న పోలీసు భార్యపై అత్యాచారం చేశాడు.మాజీ పోలీసు ఇన్స్పెక్టరు ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలవడంతో అతని భార్య విషయం చెప్పి ఇద్దరూ కలిసి షిండే పై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
