ప్రేమ జంట శావాలై తేలాయి. తెలంగాణకు చెందిన ఓ ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన చింతల లావణ్య (21), ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామానికి చెందిన దుగ్గిల రాంబాబు (29) ఇరువురూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో గత నెల 29న ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. శుక్రవారం ఉదయం పులివాగు శివాలయం వెనుక గిరిజన గ్రామమైన కిచ్చప్పగూడెం వెళ్లే పుంత రోడ్డు వద్ద మామిడి చెట్టుకు ఉరివేసుకుని శవాలై కనిపించారు.
ఉదయాన్నే పొలం పనులకు వెళుతున్న వ్యవసాయ కూలీలు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సూర్యభగవాన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని విచారణ నిర్వహించారు. లావణ్య చున్నీతో ఉరివేసుకోగా, రాంబాబు వెంట తెచ్చుకున్న టవల్తో ఉరివేసుకున్నాడు. చెట్టు కింద వారు వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఉంచి ఉరితాడులను మెడలకు బిగించుకుని అనంతరం బైక్ను తన్నివేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. రాంబాబు రాడ్డు బెండింగ్ పనులు నిర్వహించేవాడని, ఇతనిని పనిలోకి పెట్టుకున్న లావణ్య
తండ్రి బంటా మేస్త్రి అని తెలిపారు.
ఇరువురి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో లావణ్యను మందలించినట్లు, ఆమెకు వేరొకరితో వివాహం చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాంబాబు లావణ్యతో పరిచయం పెంచుకుని ప్రేమ వరకు తీసుకువెళ్లినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.