Home / CRIME / 20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?

20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?

దేశంలో రేప్ కు గురైనా మహిళలు ఏవ్వరికైనా చెప్పాలంటేనే కొంచెం జంకుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి కేసులు వేస్తున్నారు. కాని ఓ మహిళ తనను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ కొత్త ట్విస్ట్ తో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసి.. ఆ క్షణం నుంచే రంగంలోకి దిగారు. ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్‌రేప్‌న‌కు సంబంధించిన ఏ ఒక్క సమచారం కూడా వారి చేతికి చిక్కలేదు. ద‌ర్యాప్తు ప‌క‌డ్బందీగా సాగుతున్నప్పటికీ.. అత్యాచారం చేసిన వారెవ‌రో వారు కని పెట్టలేక పోతున్నారు. ఆఖరికి పోలీస్ ఇన్ఫార్మర్లనూ రంగంలోకి దించిన‌ప్పటికీ.. ఉప‌యోగం లేకుండా పోయింది. చేసేది ఏమీ లేక కేసును మ‌ళ్లీ మొద‌టి నుంచి విచారించాల‌ని నిర్ణయించారు.
ఫిర్యాదు చేసిన మ‌హిళ‌ను స్టేష‌న్‌కు పిలిపించి ప్రశ్నించారు. ఆమె పొంత‌న‌లేని స‌మాధానాల‌ను ఇస్తుండ‌టంతో అనుమానం వ‌చ్చింది పోలీసుల‌కు. ఆమె త‌ప్పుడు ఫిర్యాదు చేసిన‌ట్టు తేలింది. దీనితో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.ఈ ఘ‌ట‌న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. మిరాన్‌పూర్ బ‌స్‌స్టాండ్ వ‌ద్ద త‌న‌పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన‌ట్టు కింద‌టి నెల 29న ఓ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.నిజానికి.. ఆమెపై అత్యాచారం జ‌ర‌గ‌లేదు. సామూహిక అత్యాచారం జ‌రిగిన‌ట్టు నాట‌కం ఆడి.. ఆ ముగ్గురిపై కేసు న‌మోదు చేయించాల‌ని కొంత‌మంది త‌న‌కు 20 వేల రూపాయ‌ల‌ను ఇచ్చార‌ని, ఆ డ‌బ్బు కోస‌మే తాను ఈ నాట‌కం ఆడిన‌ట్టు ఆ మ‌హిళ అంగీక‌రించింది. దీనితో ఆమెతో పాటు ఆమెకు డ‌బ్బులు ఇచ్చి ప్రలోభ‌పెట్టిన వారినీ పోలీసులు అరెస్టు చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat