మన తెలుగు రాష్ట్రాలలో ఇంత దుర్మార్గులు ఉన్నారా! కొద్ది రోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటనతో అంతా చలించిపోయాం. కాని ఇప్పుడు వచ్చిన వార్త అంతకు మించిన కిరాతకుడి గురించి వచ్చిన వార్త వచ్చింది. ఏకంగా ఈ దుర్మార్డుడు పదహారు మంది మహిళలను హత్య చేశాడని వెల్లడవం తీవ్ర సంచలనమే.వారితో పాటు సొంత తమ్ముడిని కూడా హత్య చేశారు. మహిళల ఒంటిపై ఉన్న బంగారం, సొమ్ముల కోసమే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడు. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. . ఇటీవల ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులకు చిక్కాడు. మహాబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడ్ గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను అనే ఈ నీచుడు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డాని పోలీసులు కనుగొన్నారు.
