కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే.
ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి కోర్టుకు హాజరయ్యారు. సీనియర్ న్యాయవాదులు, పార్టీ సహచరులు, సహ రాజ్యసభ ఎంపీలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తో కలిసి ఆయన చీఫ్ జస్టిస్ కోర్టుకు హాజరయ్యారు. దీని బట్టి చూస్తే చిదంబరం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారా అనే సందేహాలు కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతున్నాయి.
