ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . పాదయాత్రలో జగన్ను కలవడానికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏం దిగులు చెందొద్దు వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఈ పాదయాత్ర 190వ రోజు ప్రారంభమైంది. జగన్ శుక్రవారం ఉదయం కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కతుంగ క్రాస్ రోడ్డు, లొల్ల, వాడ పల్లి క్రాస్ రోడ్డు మీదుగా మిర్ల పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉబలంక మీదుగా రావులపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతోంది.
