ఏపీ టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గన్ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి దగ్గర విధులు నిర్వహించారు. అయితే తన కొడుకు సాయంతో గన్ ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తోంది. తన పన్నెండేళ్ల కుమారుడితో గన్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉండే హిమాలయా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
