వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలోగల ధర్మవరంలో పర్యటించనున్నారు. నెల రోజులకు పైగా నిరాహార దీక్ష చే్స్తున్న చేనేత కార్మికులను వైఎస్ జగన్ మోహన్రెడ్డి కలిసి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. కాగా, చేనేత కార్మికుల దీక్షలకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపిన విషయం విధితమే.
అయితే, నేతన్నలు చేపట్టిన దీక్షలు నెల రోజులకు పైగా కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అండగా ఉంటానని ఎన్నికల సమయంలో మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడుతమ సమస్యలు పరిష్కరించమని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం చంద్రబాబు మోసాలకు నిదర్శనమన్నారు.