ఏపీలో విచ్చలవిడిగా వ్యహిచారం నడుస్తున్నది. తాజాగా కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యహిచార నిర్వాహకురాలు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణం ఉప్పర కాలనీకి చెందిన గాండ్ల పద్మ అలియాజ్ రాధమ్మ అంగన్వాడీ టీచర్నని చెప్పి ఆదోని శ్రీనగర్ కాలనీలో 15 రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుంది.
ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పేద మహిళలు, విద్యార్థులకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందడంతో సీఐ శివశంకర్ మహిళ ఏఎస్ఐ మీనమ్మ, సిబ్బందితో కలిసి ఆమె ఇంటికి దాడి చేశారు. విటులు ఎమ్మిగనూరుకు చెందిన యూకే వినోద్కుమార్, యూపీ రమేష్, పి.మల్లికార్జునను అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.