ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చెర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా
పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు
ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక నిర్వహించనున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైఎస్ఆర్ సీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్ ఎన్నిక హాల్లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించినా టీడీపీ నేతలు బరితెగించి విధ్వంసానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక రిటర్నింగ్ అధికారి…ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు
తెలిపారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
